Telugu Global
Business

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు, పతనమైన సెన్సెక్స్‌, నిఫ్టీ

ముంబై: వరుస నష్టాలతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరో రోజైన గురువారం కూడా నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఈరోజు 28 వేల కన్నా దిగువ స్థాయికి పడిపోయి 27,457 వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజే 654 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 188 పాయింట్లు కోల్పోయి 8,342 పాయింట్ల దగ్గర ముగిసింది. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల మేలిమి బంగారం 26 వేల 697 రూపాయలుగా ఉంది. కిలో […]

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు, పతనమైన సెన్సెక్స్‌, నిఫ్టీ
X

ముంబై: వరుస నష్టాలతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరో రోజైన గురువారం కూడా నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఈరోజు 28 వేల కన్నా దిగువ స్థాయికి పడిపోయి 27,457 వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజే 654 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 188 పాయింట్లు కోల్పోయి 8,342 పాయింట్ల దగ్గర ముగిసింది. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల మేలిమి బంగారం 26 వేల 697 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 38 వేల 593 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ 3 వేల 249 రూపాయిలు పలుకుతోంది. డాలర్ మారక విలువ 62 రూపాయల 66 పైసలుగా నమోదైంది. – పి.ఆర్‌.

First Published:  26 March 2015 11:11 AM GMT
Next Story