Telugu Global
NEWS

‘పట్టిసీమ’ పిచ్చి ప్రాజెక్టు: జేపీ

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ అనే ఓ పిచ్చి ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ్‌ విమర్శించారు. దీనికన్నా మంచి ప్రాజెక్టులు ఎన్నో ఉండగా దీనిపై ఎందుకు అంత మమకారమో తనకు అర్దం కావడం లేదని ఆయన అన్నారు. విశాఖ విమానాశ్రయంలో మాట్లాడుతూ విభజన జరిగి దాదాపు ఎనిమిది నెలలు ముగుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని ఆయన అన్నారు. కేంద్రంలో ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ […]

‘పట్టిసీమ’ పిచ్చి ప్రాజెక్టు: జేపీ
X

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ అనే ఓ పిచ్చి ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ్‌ విమర్శించారు. దీనికన్నా మంచి ప్రాజెక్టులు ఎన్నో ఉండగా దీనిపై ఎందుకు అంత మమకారమో తనకు అర్దం కావడం లేదని ఆయన అన్నారు. విశాఖ విమానాశ్రయంలో మాట్లాడుతూ విభజన జరిగి దాదాపు ఎనిమిది నెలలు ముగుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని ఆయన అన్నారు. కేంద్రంలో ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. తక్షణమే రాజధాని నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, కేంద్ర ప్రభుత్వం దాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. – పి.ఆర్‌.

First Published:  26 March 2015 11:51 PM GMT
Next Story