Telugu Global
National

ఎంఎస్‌ఓలను అదుపు చేస్తూ ట్రాయ్‌ కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: కేబుల్ టీవీ సేవలు అందించే ఎంఎస్ఓలు అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాలపై టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త నిబంధనలను రూపొందించింది. వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం, వారి చెల్లింపులకు రసీదులు ఇవ్వడం, ఈ రెండింటిని తప్పనిసరి చేస్తూ విధివిధానాలను ఖరారు చేసింది. బిల్లులు, రసీదుల విషయంలో ఇప్పటికే నిబంధ‌న‌లు అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ వాటిని ఎంఎస్ఓలు పాటించ‌డం లేద‌ని పేర్కొంది. ఎంఎస్ఓలు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌న‌డానికి ఇదే ప్ర‌ధాన ఆధార‌మ‌ని ట్రాయ్ పేర్కొంది. అలాంటి వారికి […]

ఎంఎస్‌ఓలను అదుపు చేస్తూ ట్రాయ్‌ కొత్త నిబంధనలు
X

న్యూఢిల్లీ: కేబుల్ టీవీ సేవలు అందించే ఎంఎస్ఓలు అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాలపై టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త నిబంధనలను రూపొందించింది. వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం, వారి చెల్లింపులకు రసీదులు ఇవ్వడం, ఈ రెండింటిని తప్పనిసరి చేస్తూ విధివిధానాలను ఖరారు చేసింది. బిల్లులు, రసీదుల విషయంలో ఇప్పటికే నిబంధ‌న‌లు అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ వాటిని ఎంఎస్ఓలు పాటించ‌డం లేద‌ని పేర్కొంది. ఎంఎస్ఓలు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌న‌డానికి ఇదే ప్ర‌ధాన ఆధార‌మ‌ని ట్రాయ్ పేర్కొంది. అలాంటి వారికి వినియోగదారుల సంఖ్యను బట్టి ఒక్క కనెక్షన్కు రూ. 20 చొప్పున జరిమానా విధించాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఇంకా ఎంఎస్ఓలు ఎక్క‌డెక్క‌డ ఎలాంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారో ట్రాయ్ గమనించింది. బ్రాడ్‌కాస్ట‌ర్‌ల నుంచి పెద్ద ఎత్తున వ‌సూళ్ళ‌కు పాల్ప‌డుతూ వారిని ఇర‌కాటంలో పెడుతున్నార‌ని పేర్కొంది. బ్రాడ్‌కాస్ట‌ర్ల ఛాన‌ళ్ళ‌ను ప్ర‌సారం చేయ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేయ‌డాన్ని కూడా ట్రాయ్ గుర్తించింది. దీంతోపాటు వినియోగదారుడు కోరుకునే ఛానెల్స్ ప్రసారం చేయాల్సిన బాధ్యత కూడా ఎంఎస్ఓలదేనని ట్రాయ్ స్పష్టం చేసింది. ట్రాయ్ కొత్త నిబంధనలకు కేంద్రం గురువారం అనుమతి ఇచ్చింది. – పి.ఆర్.

First Published:  26 March 2015 11:59 PM GMT
Next Story