Telugu Global
NEWS

చెత్త నుంచి విద్యుత్తు ప్లాంట్‌ సందర్శించిన మంత్రి నారాయ‌ణ‌

ఢిల్లీ ఓక్లో పారిశ్రామికవాడలోని ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ యూనిట్‌ను మంత్రి నారాయణ బృందం సందర్శించింది. ఈ తరహా ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని నారాయణ అధికారులకు సూచించారు. కాగా జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి (ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) కింద రాష్ట్రానికి రూ.549.60 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఆయా రాష్ట్రాలు పెట్టిన పెట్టుబడి మేరకు ఈ మంజూరు జరిగింది. దీంతో కలిపి ఈ ఆర్థిక […]

చెత్త నుంచి విద్యుత్తు ప్లాంట్‌ సందర్శించిన మంత్రి నారాయ‌ణ‌
X

ఢిల్లీ ఓక్లో పారిశ్రామికవాడలోని ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ యూనిట్‌ను మంత్రి నారాయణ బృందం సందర్శించింది. ఈ తరహా ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని నారాయణ అధికారులకు సూచించారు. కాగా జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి (ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) కింద రాష్ట్రానికి రూ.549.60 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఆయా రాష్ట్రాలు పెట్టిన పెట్టుబడి మేరకు ఈ మంజూరు జరిగింది. దీంతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీకి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ కింద కేంద్రం నుంచి రూ.1096.35 కోట్లు మంజూరయ్యింది.- పి.ఆర్‌.

First Published:  27 March 2015 6:59 PM GMT
Next Story