Telugu Global
Others

ఏపీ, తెలంగాణ‌ల్లో లోకేష్ ప‌ర్య‌ట‌న‌

తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు నారా లోకేష్ తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల 12 వ తేదీ నుంచి ఆయ‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. త‌మ పార్టీకి చెందిన చాలామంది కార్య‌క‌ర్త‌లు ఇటీవ‌ల కాలంలో రోడ్డు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించార‌ని, వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి త‌గిన సాయం అందించ‌డానికి ఈ ప‌ర్య‌ట‌న ఉద్దేశించామ‌ని తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్నారు. ఇందుకు ముందుగా 50 మందిని గుర్తించామ‌ని, వీరి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి ఒక్కో కుటుంబానికి రెండు ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం లోకేష్ అంద‌జేస్తార‌ని […]

ఏపీ, తెలంగాణ‌ల్లో లోకేష్ ప‌ర్య‌ట‌న‌
X
తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు నారా లోకేష్ తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల 12 వ తేదీ నుంచి ఆయ‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. త‌మ పార్టీకి చెందిన చాలామంది కార్య‌క‌ర్త‌లు ఇటీవ‌ల కాలంలో రోడ్డు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించార‌ని, వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి త‌గిన సాయం అందించ‌డానికి ఈ ప‌ర్య‌ట‌న ఉద్దేశించామ‌ని తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్నారు. ఇందుకు ముందుగా 50 మందిని గుర్తించామ‌ని, వీరి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి ఒక్కో కుటుంబానికి రెండు ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం లోకేష్ అంద‌జేస్తార‌ని ఆయ‌న తెలిపారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న షెడ్యూలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డం, కార్య‌క‌ర్త‌ల‌కు ద‌గ్గ‌ర కావ‌డం ఈ ప‌ర్య‌ట‌న ఉద్దేశ్య‌మ‌ని ఆయ‌న తెలిపారు.-పిఆర్‌
First Published:  1 April 2015 4:19 AM GMT
Next Story