Telugu Global
CRIME

సూర్యాపేట బస్టాండ్‌లో కాల్పులు ... హోంగార్డు, పోలీసు మృతి

నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి  ఓ ఆగంత‌కుడు ఒక‌ పోలీసును, మ‌రో హోంగార్డును కాల్చి చంపాడు. బస్టాండ్‌లో బందోబస్తు డ్యూటీలో ఉన్న హోం గార్డులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వారు వెంటనే సీఐకి సమాచారం అందజేశారు. సీఐ వచ్చిన తర్వాత హోం గార్డులు ఆ వ్యక్తిని సోదా చేయడానికి ప్రయత్నించగా అతడు ఊహించ‌ని విధంగా తుపాకీతో కాల్పులకు తెగ‌బ‌డ్డాడు. దీంతో కానిస్టేబుల్‌ లింగయ్య, హోం గార్డు మహేశ్‌ అక్కడికక్కడే చనిపోయారు. సీఐ […]

నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి ఓ ఆగంత‌కుడు ఒక‌ పోలీసును, మ‌రో హోంగార్డును కాల్చి చంపాడు. బస్టాండ్‌లో బందోబస్తు డ్యూటీలో ఉన్న హోం గార్డులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వారు వెంటనే సీఐకి సమాచారం అందజేశారు. సీఐ వచ్చిన తర్వాత హోం గార్డులు ఆ వ్యక్తిని సోదా చేయడానికి ప్రయత్నించగా అతడు ఊహించ‌ని విధంగా తుపాకీతో కాల్పులకు తెగ‌బ‌డ్డాడు. దీంతో కానిస్టేబుల్‌ లింగయ్య, హోం గార్డు మహేశ్‌ అక్కడికక్కడే చనిపోయారు. సీఐ మొగిలయ్య, మ‌రో హోంగార్డు కిషోర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఓ ప్రయాణికుడికి కూడా గాయాలయ్యాయి. అంతకు కొద్దిసేపటికి ముందు కారులో హైదరాబాద్ వెళుతున్న దొరబాబు అనే వ్యక్తిపై కూడా ఇద్దరు వ్య‌క్తులు కాల్పులు జరిపినట్టు తెలిసింది. హైటెక్ బ‌స్‌స్టాండ్‌లో కాల్ప‌లు జ‌రిపిందీ, దొర‌బాబు అనే వ్య‌క్తిపై కాల్పులు జ‌రిపిదీ ఒక్క‌రా కాదా అనే కోణంలో కూడా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
First Published:  1 April 2015 8:47 PM GMT
Next Story