జ్యోతిషుడి మీద కాల్పులు
హైదరాబాద్లోని సరూర్నగర్ ప్రాంతంలో పట్టపగలే ఓ దుండగుడు కాల్పలు జరిపి పారిపోయాడు. ఇందుకు కారణాలు ఏమిటో తెలియరాలేదు. జ్యోతిషం చెబుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నాగరాజు (55) ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇతనిపై ముగ్గురు వ్యక్తులు పొట్ట మీద రెండు రౌండ్లు, తొడ మీద ఒక రౌండు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి […]
BY Pragnadhar Reddy1 April 2015 8:42 PM GMT
Pragnadhar Reddy Updated On: 1 April 2015 8:43 PM GMT
హైదరాబాద్లోని సరూర్నగర్ ప్రాంతంలో పట్టపగలే ఓ దుండగుడు కాల్పలు జరిపి పారిపోయాడు. ఇందుకు కారణాలు ఏమిటో తెలియరాలేదు. జ్యోతిషం చెబుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నాగరాజు (55) ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇతనిపై ముగ్గురు వ్యక్తులు పొట్ట మీద రెండు రౌండ్లు, తొడ మీద ఒక రౌండు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొద్ది నెలల క్రితం విజయవాడ సమీపంలో ప్రయాణిస్తున్న కారు మీద దాడి చేసి ఒక జ్యోతిషుడితో సహా ముగ్గురిని హత్య చేసిన కేసులో నాగరాజు కూడా నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు నాగరాజు మీద ఆ కేసుకు సంబంధించిన వారే కాల్పులు జరిపారా లేదా వేరే ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అని తేలాల్సి ఉంది. ఆయనకు ఉన్న ఇతర సంబంధాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story