Telugu Global
International

కెన్యా ఉగ్ర దాడిలో 147మంది విద్యార్ధుల బ‌లి

కెన్యా దేశంలో గరిస్సా విశ్వవిద్యాలయ కాలేజీపై నిన్న సోమాలియాకు చెందిన అల్-షబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 147మంది విద్యార్ధులు దుర్మ‌ర‌ణం పాల‌వ్వ‌గా మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. మారణాయుధాలతో విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి ముందుగా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆ తరువాత లోపల ఉన్న విద్యార్ధులు, అధ్యాపకులలో ముస్లిం మతస్థులను గుర్తించి వారిని బయటకు పంపేసి మిగిలిన క్రిస్టియన్ విద్యార్ధులు, అధ్యాపకులను బందీలుగా పట్టుకుని వారిలో 147మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి […]

కెన్యా ఉగ్ర దాడిలో 147మంది విద్యార్ధుల బ‌లి
X
కెన్యా దేశంలో గరిస్సా విశ్వవిద్యాలయ కాలేజీపై నిన్న సోమాలియాకు చెందిన అల్-షబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 147మంది విద్యార్ధులు దుర్మ‌ర‌ణం పాల‌వ్వ‌గా మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. మారణాయుధాలతో విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి ముందుగా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆ తరువాత లోపల ఉన్న విద్యార్ధులు, అధ్యాపకులలో ముస్లిం మతస్థులను గుర్తించి వారిని బయటకు పంపేసి మిగిలిన క్రిస్టియన్ విద్యార్ధులు, అధ్యాపకులను బందీలుగా పట్టుకుని వారిలో 147మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.
ఇది తెలిసిన వెంట‌నే కెన్యా భద్రతా సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకుని విశ్వవిద్యాలయాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల చెరలో చిక్కుకొన్న 587 మందిని విడిపించగలిగారు. దాదాపు 12 గంటలసేపు ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకరపోరు జరిగిన తరువాత లోపల ఉన్న ఉగ్రవాదులందరూ హతం అయినట్లు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని సోమాలియాకు చెందిన అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకొంది. తమ దేశ చరిత్రలో ఇది అత్యంత దురదృష్టకరమయిన రోజని కెన్యా దేశాధ్యక్షుడు ఉహురు కెన్యాట్ట అన్నారు.‍-పీఆర్‌
First Published:  3 April 2015 12:31 AM GMT
Next Story