Telugu Global
NEWS

క‌మ‌నీయం... కోదండ‌రాముని క‌ల్యాణం

క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట‌ ఆల‌యంలో కోదండ‌రామ‌స్వామి క‌ల్యాణోత్స‌వం అత్యంత‌ వైభ‌వోపేతంగా జ‌రిగింది. వాస్త‌వానికి శ్రీ‌రామ న‌వమి రోజు సీతారామ క‌ల్యాణం జ‌ర‌గాల్సి ఉండ‌గా ఇక్క‌డ ఆన‌వాయితీ ప్ర‌కారం కొదండ‌రామ స్వామి, సీత‌మ్మ త‌ల్లికి ఐదో రోజు వివాహం చేస్తారు. ఆ ఆన‌వాయితీని కాద‌న‌కుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అధికార లాంఛనాల‌తో గురువారం రాత్రి చిక్క‌టి వెన్న‌ల‌లో, చ‌క్క‌ని వాతావ‌ర‌ణంలో సీతారామ‌చంద్రుల వివాహం క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించారు. తొలిసారిగా రాష్ట్ర ప్ర‌భుత్వ లాంఛ‌నాలైన ప‌ట్టువ‌స్త్రాల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సీతారాముల‌కు అందించారు. […]

క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట‌ ఆల‌యంలో కోదండ‌రామ‌స్వామి క‌ల్యాణోత్స‌వం అత్యంత‌ వైభ‌వోపేతంగా జ‌రిగింది. వాస్త‌వానికి శ్రీ‌రామ న‌వమి రోజు సీతారామ క‌ల్యాణం జ‌ర‌గాల్సి ఉండ‌గా ఇక్క‌డ ఆన‌వాయితీ ప్ర‌కారం కొదండ‌రామ స్వామి, సీత‌మ్మ త‌ల్లికి ఐదో రోజు వివాహం చేస్తారు. ఆ ఆన‌వాయితీని కాద‌న‌కుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అధికార లాంఛనాల‌తో గురువారం రాత్రి చిక్క‌టి వెన్న‌ల‌లో, చ‌క్క‌ని వాతావ‌ర‌ణంలో సీతారామ‌చంద్రుల వివాహం క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించారు. తొలిసారిగా రాష్ట్ర ప్ర‌భుత్వ లాంఛ‌నాలైన ప‌ట్టువ‌స్త్రాల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సీతారాముల‌కు అందించారు. ఈ వేడుక‌లో పాల్గొనేందుకు అశేష జ‌నం త‌ర‌లిరావ‌డంతో ఒంటిమిట్ట కిట‌కిట‌లాడింది. ఐదు కిలోమీట‌ర్ల మేర భ‌క్తుల వ్యాపించి ఆ ప్రాంతానికే కొత్త క‌ళ సంత‌రించుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఎన్‌. చంద్ర‌బాబునాయుడుతోపాటు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దంప‌తులు ఈ క‌ల్యాణోత్స‌వానికి హాజ‌రై త‌మ భ‌క్తిప్ర‌ప‌త్తులు సాటుకున్నారు. క‌ల్యాణోత్స‌వానికి కొన్ని గంట‌ల ముందే క‌డ‌ప‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు ప‌లు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అనంత‌రం ఒంటిమిట్ట‌లో జ‌రిగే బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ ముగిసిన త‌ర్వాత మ‌ళ్ళీ ఆయ‌న కోదండ‌రాముని క‌ల్యాణ వేడుక‌కు హాజ‌రై త‌మ భ‌క్తి భావాన్ని చాటుకున్నారు -పీఆర్‌
First Published:  2 April 2015 9:03 PM GMT
Next Story