Telugu Global
NEWS

గోదావరి పరిరక్షణ కోసమే 5 కే రన్‌ : ముర‌ళీమోహ‌న్‌

పవిత్ర గోదావరి నది కలుషితం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ నెల 12న గోదావరి 5-కే రన్‌ నిర్వహిస్తున్నామని రాజమండ్రి ఎంపీ, సినీ న‌టుడు మాగంటి మురళీమోహన్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 5కే రన్‌ లోగోను ఆవిష్కరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరిలో మురుగు నీరు కలువకుండా అండర్ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారన్నారని తెలిపారు. ప్రస్తుతం మురుగునీరును గోదావరిలో కలువకుండా దారి మళ్లించారన్నారు. మా మూవీ అసోసియేషన్‌ […]

గోదావరి పరిరక్షణ కోసమే 5 కే రన్‌ : ముర‌ళీమోహ‌న్‌
X
పవిత్ర గోదావరి నది కలుషితం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ నెల 12న గోదావరి 5-కే రన్‌ నిర్వహిస్తున్నామని రాజమండ్రి ఎంపీ, సినీ న‌టుడు మాగంటి మురళీమోహన్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 5కే రన్‌ లోగోను ఆవిష్కరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరిలో మురుగు నీరు కలువకుండా అండర్ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారన్నారని తెలిపారు. ప్రస్తుతం మురుగునీరును గోదావరిలో కలువకుండా దారి మళ్లించారన్నారు. మా మూవీ అసోసియేషన్‌ ఎన్నికలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న కోర్టు విచార‌ణ‌ ఉందని ఆరోజు ఎప్పుడు కౌంటింగ్‌ నిర్వహించేది తెలుస్తుంద‌ని అన్నారు.-పీఆర్‌
First Published:  4 April 2015 2:15 AM GMT
Next Story