కల్యాణ లక్ష్మి కోసం టవరెక్కిన వరుడు
రంగారెడ్డి జిల్లా చేవెళ్లకి చెందిన ఎరుకల రాజుకు అదే గ్రామానికి చెందిన సార్ల రోజాతో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 8న వివాహం జరగనుంది. ఇందుకోసం వధువు కుటుంబ సభ్యులు కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత అధికారులు వచ్చి ధ్రువపత్రాల వెరిఫికేషన్ చేశారు. పథకం లబ్ది చేకూరాలంటే వరుడి జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం ఎలా తీసుకోవాలో తెలియని రాజు మనస్థాపానికి గురై బీఎ్సఎన్ఎల్ టవర్ ఎక్కాడు. అక్కడినుంచి […]
BY Pragnadhar Reddy3 April 2015 9:34 PM GMT
Pragnadhar Reddy Updated On: 3 April 2015 9:34 PM GMT
రంగారెడ్డి జిల్లా చేవెళ్లకి చెందిన ఎరుకల రాజుకు అదే గ్రామానికి చెందిన సార్ల రోజాతో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 8న వివాహం జరగనుంది. ఇందుకోసం వధువు కుటుంబ సభ్యులు కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత అధికారులు వచ్చి ధ్రువపత్రాల వెరిఫికేషన్ చేశారు. పథకం లబ్ది చేకూరాలంటే వరుడి జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం ఎలా తీసుకోవాలో తెలియని రాజు మనస్థాపానికి గురై బీఎ్సఎన్ఎల్ టవర్ ఎక్కాడు. అక్కడినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. పోలీసులు పెళ్లికొడుక్కి నచ్చజెప్పి కిందకు దింపారు.-పీఆర్
Next Story