Telugu Global
NEWS

రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం

విశాఖ జిల్లాలోని గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో కోటిరూపాయల విలువైన 800 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దేవరాపల్లి వద్ద ఆటోలో 250 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మరో ఆటో పోలీసులను ఢీకొట్టి వెళ్లింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్‌, హోంగార్డుకు గాయాలయ్యాయి. పారిపోయిన ఆటో డ్రైవ‌ర్‌ కోసం, దీన్ని త‌ర‌లిస్తున్న వ్య‌క్తులు ఎవ‌ర‌న్న‌ది గుర్తించ‌డం కోసం పోలీసులు త‌నిఖీలు ప్రారంభించారు.-పీఆర్‌

విశాఖ జిల్లాలోని గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో కోటిరూపాయల విలువైన 800 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దేవరాపల్లి వద్ద ఆటోలో 250 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మరో ఆటో పోలీసులను ఢీకొట్టి వెళ్లింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్‌, హోంగార్డుకు గాయాలయ్యాయి. పారిపోయిన ఆటో డ్రైవ‌ర్‌ కోసం, దీన్ని త‌ర‌లిస్తున్న వ్య‌క్తులు ఎవ‌ర‌న్న‌ది గుర్తించ‌డం కోసం పోలీసులు త‌నిఖీలు ప్రారంభించారు.-పీఆర్‌
First Published:  4 April 2015 2:37 AM GMT
Next Story