Telugu Global
CRIME

ఎన్‌కౌంట‌ర్‌లో దొంగ‌లు హ‌తం

సూర్యాపేట కాల్పుల నిందితులు హ‌త‌య్యారు. ఈ ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయారు.సినిమా స్ల‌యిల్‌లో ఈ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. న‌ల్గొండ జిల్లాలోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాల్పుల మోత‌తో జాన‌కీపురం గ్రామం ఉలిక్కిప‌డింది. ఎదురుకాల్పుల్లో మొన్న రాత్రి సూర్యాపేట బ‌స్టాండ్‌లో కాల్పులు జ‌రిపి కానిస్టేబుల్‌ను,హోంగార్డును చంపిన దొంగ‌లు ఇవాళ మ‌రో కానిస్టేబుల్ నాగ‌రాజును చంపారు. పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో నిందితులు ఇద్ద‌రూ చ‌నిపోయారు. వీరిద్ద‌రూ అస్లాం, అయుబ్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రూ యూపీకి చెందిన ఇర్ఫాన్ గ్యాంగ్ సభ్యులుగా […]

సూర్యాపేట కాల్పుల నిందితులు హ‌త‌య్యారు. ఈ ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయారు.సినిమా స్ల‌యిల్‌లో ఈ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. న‌ల్గొండ జిల్లాలోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాల్పుల మోత‌తో జాన‌కీపురం గ్రామం ఉలిక్కిప‌డింది. ఎదురుకాల్పుల్లో మొన్న రాత్రి సూర్యాపేట బ‌స్టాండ్‌లో కాల్పులు జ‌రిపి కానిస్టేబుల్‌ను,హోంగార్డును చంపిన దొంగ‌లు ఇవాళ మ‌రో కానిస్టేబుల్ నాగ‌రాజును చంపారు. పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో నిందితులు ఇద్ద‌రూ చ‌నిపోయారు. వీరిద్ద‌రూ అస్లాం, అయుబ్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రూ యూపీకి చెందిన ఇర్ఫాన్ గ్యాంగ్ సభ్యులుగా పోలీసులుఅనుమానిస్తున్నారు. ఈ కాల్పుల్లోనే సిఐ బాల‌గంగిరెడ్డి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈయ‌న‌కు హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.  

First Published:  3 April 2015 11:30 PM GMT
Next Story