Telugu Global
NEWS

ముందు భార్య..తర్వాత భర్త..కామినేనిలో దంపతులకు చికిత్స

ముందు భార్య.. తర్వాత భర్త… కామినేనిలో ఎస్సై సిద్ధయ్య దంపతులకు చికిత్స ! సూర్యాపేట కాల్పుల సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్సై సిద్ధయ్య కామినేని ఆస్పతిల్రో చికిత్సకు ముందే అత‌ని భార్య ఇదే ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సై సిద్ధ‌య్య‌ భార్యకు పురిటి నొప్పులు రావ‌డంతో ఆమెను ఇక్క‌డే ముందు చేర్చారు. పురిటినొప్పులు ఎక్కువవడంతో శనివారం ఉదయం ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్‌ కూడా చేశారు. ఈలోపే సిద్ధయ్య కూడా గాయాలతో ఇక్కడికి రావడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. 10 […]

ముందు భార్య.. తర్వాత భర్త… కామినేనిలో ఎస్సై సిద్ధయ్య దంపతులకు చికిత్స !
సూర్యాపేట కాల్పుల సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్సై సిద్ధయ్య కామినేని ఆస్పతిల్రో చికిత్సకు ముందే అత‌ని భార్య ఇదే ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సై సిద్ధ‌య్య‌ భార్యకు పురిటి నొప్పులు రావ‌డంతో ఆమెను ఇక్క‌డే ముందు చేర్చారు. పురిటినొప్పులు ఎక్కువవడంతో శనివారం ఉదయం ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్‌ కూడా చేశారు. ఈలోపే సిద్ధయ్య కూడా గాయాలతో ఇక్కడికి రావడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
10 మంది వైద్యుల పర్యవేక్షణలో సిద్ధయ్యకు ఆపరేషన్‌
తీవ్రంగా గాయపడిన ఎస్సై సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడేమీ చెప్పలేమని కామినేని ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. ఇప్పటికే 10 మంది వైద్యుల పర్యవేక్షణలో ఆపరేషన్ చేశారు. అయితే అత‌ని శ‌రీరంలో ఇంకా బుల్లెట్లు ఉన్నాయి. ఇవి తీయ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఒకే ఆస్ప‌త్రిలో ఉన్న భార్యాభ‌ర్త‌లు త్వ‌ర‌గా కోలుకుని పండంటి బ‌డ్డ‌తో ఇంటికి వెళ్ళాల‌ని శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.-పీఆర్‌
First Published:  4 April 2015 12:22 PM GMT
Next Story