Telugu Global
NEWS

పీపీపీ పద్ధతిలో టూరిజం ప్రాజెక్టులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టూరిజం ప్రాజెక్టులను ప్ర‌జ‌లు-ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. అస‌లు ఎక్క‌డెక్క‌డ కొత్త‌గా ఈ ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌ను చేప‌ట్టాలి. అవి ప‌ర్యాట‌కుల‌కు ఎంత వ‌ర‌కు ఆనందం పంచుతాయి… వంటి విష‌యాల‌ను విశ్లేష‌నాత్మ‌కంగా అధ్య‌య‌నం చేయ‌డానికే ఈ  ఉప‌సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా మంత్రులు యనమల రామ‌కృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులను ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నియమించారు.  రాష్ట్రంలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం […]

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టూరిజం ప్రాజెక్టులను ప్ర‌జ‌లు-ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. అస‌లు ఎక్క‌డెక్క‌డ కొత్త‌గా ఈ ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌ను చేప‌ట్టాలి. అవి ప‌ర్యాట‌కుల‌కు ఎంత వ‌ర‌కు ఆనందం పంచుతాయి… వంటి విష‌యాల‌ను విశ్లేష‌నాత్మ‌కంగా అధ్య‌య‌నం చేయ‌డానికే ఈ ఉప‌సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా మంత్రులు యనమల రామ‌కృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులను ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నియమించారు. రాష్ట్రంలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ముఖ్య‌మంత్రికి నివేదిక స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.-పీఆర్‌
First Published:  4 April 2015 11:46 PM GMT
Next Story