Telugu Global
National

ఇసుక మాఫియాకు మరో పోలీస్‌ బలి

మధ్యప్రదేశ్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫీయా…మ‌రో  పోలీసు ప్రాణం తీసింది. మొరినా జిల్లాలో మూడేళ్ల క్రితం నరేంద్ర కుమార్‌ అనే ఐపీఎస్‌ అధికారిని చంపిన ఇసుక మాఫియా… మళ్లీ అదే జిల్లాలో తాజాగా పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు తీసింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీ చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ ధర్మేంద్ర సింగ్‌ చౌహాన్‌… రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీని గుర్తించాడు. ఇసుక తరలింపు విషయంపై డ్రైవర్‌ను అతడి డోరు పక్కనే నిలబడి ప్రశ్నిస్తుండగా… డ్రైవర్‌ రివర్స్‌ గేర్‌లో […]

మధ్యప్రదేశ్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫీయా…మ‌రో పోలీసు ప్రాణం తీసింది. మొరినా జిల్లాలో మూడేళ్ల క్రితం నరేంద్ర కుమార్‌ అనే ఐపీఎస్‌ అధికారిని చంపిన ఇసుక మాఫియా… మళ్లీ అదే జిల్లాలో తాజాగా పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు తీసింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీ చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ ధర్మేంద్ర సింగ్‌ చౌహాన్‌… రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీని గుర్తించాడు. ఇసుక తరలింపు విషయంపై డ్రైవర్‌ను అతడి డోరు పక్కనే నిలబడి ప్రశ్నిస్తుండగా… డ్రైవర్‌ రివర్స్‌ గేర్‌లో లారీని వేగంగా రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి పోనిచ్చాడు. అది ఒక్కసారిగా ఒక పక్కకు ఒరిగిపోవడంతో… పక్కనే పరుగెడుతున్న ధర్మేంద్ర లారీ కింద పడి అక్కడిక్కడే చనిపోయాడు. దీంతో, డ్రైవర్‌ పారిపోయాడు.-పీఆర్‌
First Published:  6 April 2015 9:47 AM GMT
Next Story