Telugu Global
NEWS

అశోక్ బాబుపై మండిపడుతున్న ఏపి ఉద్యోగులు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఏపి ఉద్యోగులు తమ రెండు రోజుల జీతాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. మళ్ళీ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మరో రెండు రోజుల జీతాన్ని విరాళంగా అందజేసారు. ఇటీవల ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలకు ఒక్క రోజు జీతాన్ని రాజధాని అభివృధి కోసం విరాళంగా ఇవ్వాలని ఉద్యోగులను కోరారు.సామాన్య‌ ఉద్యోగులతో సంప్రదించకుండానే ఇటీవల అశోక్ బాబు తమకు రావల్సిన ఎరియర్స్ నుంచి పదిహేను రోజుల జీతాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇస్తామని ప్రకటించడం […]

అశోక్ బాబుపై మండిపడుతున్న ఏపి ఉద్యోగులు..
X

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఏపి ఉద్యోగులు తమ రెండు రోజుల జీతాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. మళ్ళీ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మరో రెండు రోజుల జీతాన్ని విరాళంగా అందజేసారు. ఇటీవల ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలకు ఒక్క రోజు జీతాన్ని రాజధాని అభివృధి కోసం విరాళంగా ఇవ్వాలని ఉద్యోగులను కోరారు.సామాన్య‌ ఉద్యోగులతో సంప్రదించకుండానే ఇటీవల అశోక్ బాబు తమకు రావల్సిన ఎరియర్స్ నుంచి పదిహేను రోజుల జీతాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇస్తామని ప్రకటించడం చంద్రబాబు మెప్పుకోసం తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసమో లేక ఉద్యోగుల ప్రయోజనం కోసమో కాదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు మెప్పు పొంది ఎం.ఎల్.సీ సీటు సంపాదించడం కోసమే ఈ తాపత్రయ మంతా అని ఉద్యోగులు గుర్రుమంటున్నారు.
చంద్రబాబు ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్ళాలన్నా ఛార్టర్డ్ ఫ్లైట్లనే వాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే , వాస్తు పిచ్చితో కార్యాలయంలో మార్పులకు డబ్బు తగలేస్తుంటే మంత్రులు తదితరులకు ఖరీదైన విదేశీ లాప్ టాప్ లకు డబ్బును మంచి నీరులా ఖర్చు పెడుతుంటే, ఒకటికి రెండు మూడు చోట్ల‌ కాన్వాయ్ లు ఏర్పాటు చేసుకొని ప్రజల డబ్బును విచ్చలవిడిగా తగలేస్తుంటే ఇంకా ఉద్యోగులు విరాళాలు ఇవ్వాలా అని చంద్రబాబును, అశోక్ బాబును ఉద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

First Published:  8 April 2015 11:59 PM GMT
Next Story