Telugu Global
Cinema & Entertainment

ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన స్పాట్ కు ద‌గ్గ‌ర‌గా శృతిహాస‌న్..!

ఎన్ కౌంటర్ జ‌రిగింది అంటేనే ఒక విధ‌మైన భ‌యం ఉంటుంది. ఇక ఆ చోటికి వెళ్ల‌డం అంటే రిస్క్ అనుకుంటారు . కానీ హీరోయిన్ శృతిహాస‌న్ మాత్రం డైరెక్ట్ గా ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన ప్లేస్ స‌మీపానికి వెళ్లింది. బుధ‌వారం శేషాచ‌ల ప‌ర్వ‌త ప్రాంతంలో ఎర్ర‌చంద‌నం కూలీలు 20 మందిని ఏపి ప్రభుత్వం ఎన్ కౌంట‌ర్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ స్పాట్ ప్ర‌స్తుతం టెర్ర‌ర్ గా ఉంటే .. హీరోయిన్ శృతిహాస‌న్, హీరో విజ‌య్ పులి […]

ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన స్పాట్ కు ద‌గ్గ‌ర‌గా శృతిహాస‌న్..!
X

ఎన్ కౌంటర్ జ‌రిగింది అంటేనే ఒక విధ‌మైన భ‌యం ఉంటుంది. ఇక ఆ చోటికి వెళ్ల‌డం అంటే రిస్క్ అనుకుంటారు . కానీ హీరోయిన్ శృతిహాస‌న్ మాత్రం డైరెక్ట్ గా ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన ప్లేస్ స‌మీపానికి వెళ్లింది. బుధ‌వారం శేషాచ‌ల ప‌ర్వ‌త ప్రాంతంలో ఎర్ర‌చంద‌నం కూలీలు 20 మందిని ఏపి ప్రభుత్వం ఎన్ కౌంట‌ర్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ స్పాట్ ప్ర‌స్తుతం టెర్ర‌ర్ గా ఉంటే .. హీరోయిన్ శృతిహాస‌న్, హీరో విజ‌య్ పులి సినిమా షూటింగ్ నిమిత్తం స్పాట్ స‌మీపానికి వెళ్లారు.

అయితే విశేషం ఏమిటంటే.. ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన ప్లేస్ కు 30 కిలోమీటర్ల దూరంలో పులి సినిమా షూటింగ్ చేశారు. షూటింగ్ ముగించికుని తిరుగు ప్ర‌యాణం అయిన చిత్ర యూనిట్ వాహానాల‌ను త‌ల‌కోన చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర పోలీసులు చెక్ చేశార‌ట‌. అప్పుడు శృతిహాస‌న్ కు ఎన్ కౌంట‌ర్ న్యూస్ తెలియ‌డంతో అవాక్కయ్యింద‌ట‌. మొత్తం మీద ఒక వైపు ఫైరింగ్..మ‌రో వైపు షూటింగ్ చేశార‌న్న‌మాట‌. పులి చిత్రంలో లెజండ్రీ యాక్ట‌రెస్ శ్రీ‌దేవి, హ‌న్సికలు కూడా కీరోల్ చేస్తున్నారు. సోషియో ఫాంట‌సీ చిత్రంగా త‌మిళ డైరెక్టర్ వెంక‌ట్ ప్ర‌భు పులి చిత్రాని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

First Published:  9 April 2015 5:34 AM GMT
Next Story