Telugu Global
National

మందుపాత‌ర పేల్చిన మావోలు: న‌లుగురు మృతి

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి మ‌వోయిస్టులు విరుచుకుప‌డ్డారు. దంతెవాడ జిల్లాలో కిరండోల్‌-, ప‌ల్నార్‌ మ‌ధ్య‌ వారు శ‌క్తివంత‌మైన మందుపాత‌ర పేల్చారు. ఈ సంఘ‌ట‌న‌లో న‌లుగురు జ‌వాన్లు మ‌ర‌ణించ‌డంతోపాటు అదే వ్యానులో వెళుతున్న 11 మంది గాయ‌ప‌డ్డారు. గ‌త మూడు రోజుల్లో ఇది నాలుగో సంఘ‌ట‌న. కూంబింగ్ ఆప‌రేష‌న్ కోసం ఒక వ్యానులో జ‌వానులంతా బ‌యలుదేరారు. ఇది గ‌మ‌నించిన మావోలు ఒక‌చోట మాటు వేశారు. మైన్ ప్రొటెక్టివ్‌ వ్యాను స‌మీపానికి రాగానే అక్క‌డ అమ‌ర్చిన అతి శ‌క్తివంత‌మైన మందుపాత‌ర‌ను పేల్చారు. ఈ […]

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి మ‌వోయిస్టులు విరుచుకుప‌డ్డారు. దంతెవాడ జిల్లాలో కిరండోల్‌-, ప‌ల్నార్‌ మ‌ధ్య‌ వారు శ‌క్తివంత‌మైన మందుపాత‌ర పేల్చారు. ఈ సంఘ‌ట‌న‌లో న‌లుగురు జ‌వాన్లు మ‌ర‌ణించ‌డంతోపాటు అదే వ్యానులో వెళుతున్న 11 మంది గాయ‌ప‌డ్డారు. గ‌త మూడు రోజుల్లో ఇది నాలుగో సంఘ‌ట‌న. కూంబింగ్ ఆప‌రేష‌న్ కోసం ఒక వ్యానులో జ‌వానులంతా బ‌యలుదేరారు. ఇది గ‌మ‌నించిన మావోలు ఒక‌చోట మాటు వేశారు. మైన్ ప్రొటెక్టివ్‌ వ్యాను స‌మీపానికి రాగానే అక్క‌డ అమ‌ర్చిన అతి శ‌క్తివంత‌మైన మందుపాత‌ర‌ను పేల్చారు. ఈ సంఘ‌ట‌న‌లో న‌లుగురు జ‌వాన్లు అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా మ‌రో 11 మంది గాయ‌ప‌డ్డారు. ఇందులో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.-పీఆర్‌
First Published:  13 April 2015 6:32 AM GMT
Next Story