Telugu Global
Cinema & Entertainment

అన్నీ మలేషియాలోనే అంటున్న మిత్రవింద

మగధీరలోని మిత్రవింద క్యారెక్టర్ తో పాపులర్ అయిన కాజల్ ఇప్పుడు నిర్మాతలకు సరికొత్త కండిషన్ పెడుతోంది. కాల్షీట్లు ఇస్తాను కానీ షూటింగ్ లు మాత్రం మలేషియాలోనే పెట్టుకోండని కొత్త రూల్ పెడుతోంది. తాజాగా విక్రమ్ తో ఓ సినిమాకు కమిటైంది కలువకళ్ల కాజల్. ఈ సినిమా షూటింగ్ ను కూడా మలేషియాలోనే పెట్టుకోమంటోంది. దీనివెనక ఓ కారణం ఉంది. తమిళ్ లో ఒకేసారి రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగులు మలేషియా దీవుల్లోనే జరుగుతున్నాయి. […]

అన్నీ మలేషియాలోనే అంటున్న మిత్రవింద
X

మగధీరలోని మిత్రవింద క్యారెక్టర్ తో పాపులర్ అయిన కాజల్ ఇప్పుడు నిర్మాతలకు సరికొత్త కండిషన్ పెడుతోంది. కాల్షీట్లు ఇస్తాను కానీ షూటింగ్ లు మాత్రం మలేషియాలోనే పెట్టుకోండని కొత్త రూల్ పెడుతోంది. తాజాగా విక్రమ్ తో ఓ సినిమాకు కమిటైంది కలువకళ్ల కాజల్. ఈ సినిమా షూటింగ్ ను కూడా మలేషియాలోనే పెట్టుకోమంటోంది. దీనివెనక ఓ కారణం ఉంది. తమిళ్ లో ఒకేసారి రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగులు మలేషియా దీవుల్లోనే జరుగుతున్నాయి. మరోవైపు తన సమ్మర్ వెకేషన్ లో భాగంగా మలేషియాలోనే సేదతీరుతోంది కాజల్. కాబట్టి ఓ వైపు సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా కానిచ్చేస్తోంది. 5 గంటలు మాత్రమే షూటింగ్ కు కేటాయించి మిగతా టైమ్ లో మలేషియాలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోంది. సో.. విక్రమ్ సినిమాని కూడా ఓ నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ పెట్టుకోమని రిక్వెస్ట్ చేసింది. అదీ సంగతి.

First Published:  23 April 2015 3:50 AM GMT
Next Story