Telugu Global
Others

కార్యకర్తలను కొనలేరు : రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులను కొనగలరేమో కానీ ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తలను కొనలేరని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన టీడీపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు సభను తెలంగాణ ప్రజలు చూడకుండా ఉండేందుకు తెలంగాణ జిల్లాల్లో కరెంటు కట్‌ చేశారని ఆరోపించారు. టీడీపీని ఖాళీ చేయడం ఎవరి వల్లా కాదని అన్నారు. కేసీఆర్‌ ముత్తాత దిగివచ్చినా టీడీపీని ఏం చేయలేరని ధీమా […]

మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులను కొనగలరేమో కానీ ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తలను కొనలేరని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన టీడీపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు సభను తెలంగాణ ప్రజలు చూడకుండా ఉండేందుకు తెలంగాణ జిల్లాల్లో కరెంటు కట్‌ చేశారని ఆరోపించారు. టీడీపీని ఖాళీ చేయడం ఎవరి వల్లా కాదని అన్నారు. కేసీఆర్‌ ముత్తాత దిగివచ్చినా టీడీపీని ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.
First Published:  23 April 2015 3:06 AM GMT
Next Story