Telugu Global
Cinema & Entertainment

మొదట అనుకున్నది మూడోదిగా మారింది

నాగబాబు తనయుడు, మెగాకాంపౌండ్ అందగాడు వరుణ్ తేజ ఎంట్రీపై ఎంత సస్పెన్స్ నడిచిందో అందరికీ తెలిసిందే. ఎంతోమంది దర్శకుల పేర్లు పరిశీలించి ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరోగా వెండితెరపై ప్రత్యక్షమయ్యాడు వరుణ్. అయితే అప్పట్లో పరిశీలించిన పేర్ల జాబితాలో ప్రముఖంగా వినిపించిన పేరు పూరి జగన్నాధ్. దాదాపు పూరి చేతుల మీదుగానే వరుణ్ ఎంట్రీ ఉంటుందని అంతా ఫిక్సయిపోయారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య పూరీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత […]

మొదట అనుకున్నది మూడోదిగా మారింది
X
నాగబాబు తనయుడు, మెగాకాంపౌండ్ అందగాడు వరుణ్ తేజ ఎంట్రీపై ఎంత సస్పెన్స్ నడిచిందో అందరికీ తెలిసిందే. ఎంతోమంది దర్శకుల పేర్లు పరిశీలించి ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరోగా వెండితెరపై ప్రత్యక్షమయ్యాడు వరుణ్. అయితే అప్పట్లో పరిశీలించిన పేర్ల జాబితాలో ప్రముఖంగా వినిపించిన పేరు పూరి జగన్నాధ్. దాదాపు పూరి చేతుల మీదుగానే వరుణ్ ఎంట్రీ ఉంటుందని అంతా ఫిక్సయిపోయారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య పూరీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత వరుణ్ తో చేద్దామనుకున్న ఆ సినిమానే నితిన్ తో హార్ట్ ఎటాక్ పేరిట తెరకెక్కించాడు పూరి జగన్నాధ్. ఈ గ్యాప్ లో వరుణ్ తేజ కూడా ముకుందా సినిమాతో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు వరుణ్-పూరి కాంబినేషన్ సెట్ అయింది. అయితే రెండో సినిమాగా మాత్రం కాదు.. మూడో సినిమాగా. అవును.. ప్రస్తుతం వరుణ్ తేజ కంచె అనే సినిమా చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత తన హ్యాట్రిక్ మూవీగా పూరీ జగన్నాధ్ తో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు వరుణ్ తేజ. జూన్ లో ఈ కొత్త సినిమా ప్రారంభమౌతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు సెట్స్ పైకి వెళ్తుంది. శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్-2 కింద వరుణ్-పూరి సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. సి.కల్యాణ్ ఈ కొత్త సినిమాకు సమర్పకుడు. బాలీవుడ్ కు చెందిన ఓ ముద్దుగుమ్మను ఇందులో హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
First Published:  27 April 2015 9:56 PM GMT
Next Story