ఈతకెళ్ళి ఏడుగురు హైదరాబాదీలు దుర్మరణం
మహబూబ్నగర్ జిల్లాలోని ఆమనగల్లు మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వెళ్ళిన ఏడుగురు చెరికొండ చెరువులో ఈతకెళ్ళారు. 18 యేళ్ళ మస్కాన్ బేగం చెరువులోకి దిగింది. లోతు తెలియక అడుగు వేసి మునిగిపోవడం మొదలైంది. ఆమెను కాపాడేందుకు ఒకరు చేయి అందించారు. అతనూ ప్రమాదంలో పడ్డాడు. అతన్ని కాపాడేందుకు మరొకరు… ఇలా ఒకరి తర్వాత మరొకరు చొప్పున ఏడుగురు చెరువులో మునిగిపోయారు. ఇలా ఊపిరాడక స్నానానికి వెళ్ళిన ఏడుగురు ప్రాణాలు […]
BY sarvi29 April 2015 7:05 AM GMT
sarvi Updated On: 30 April 2015 12:27 AM GMT
మహబూబ్నగర్ జిల్లాలోని ఆమనగల్లు మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వెళ్ళిన ఏడుగురు చెరికొండ చెరువులో ఈతకెళ్ళారు. 18 యేళ్ళ మస్కాన్ బేగం చెరువులోకి దిగింది. లోతు తెలియక అడుగు వేసి మునిగిపోవడం మొదలైంది. ఆమెను కాపాడేందుకు ఒకరు చేయి అందించారు. అతనూ ప్రమాదంలో పడ్డాడు. అతన్ని కాపాడేందుకు మరొకరు… ఇలా ఒకరి తర్వాత మరొకరు చొప్పున ఏడుగురు చెరువులో మునిగిపోయారు. ఇలా ఊపిరాడక స్నానానికి వెళ్ళిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందినవారు ఐదుగురు కాగా మరో ఇద్దరు వారి సమీప బంధువులు. నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన వారిలో బహీర్ (38 ), సల్మాన్ (28 ), మున్నా (18 ), రుకియా (18 ), రెహమాన్ (18 ), మస్కాన్ (18), మషరత్ (16 ). వీరంతా హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టకు చెందినవారుగా చెబుతున్నారు.
Next Story