Telugu Global
Cinema & Entertainment

‘అన్నమయ్య’  చిత్ర‌మే టీటీడీ ప‌ద‌వి ఇచ్చింది: రాఘ‌వేంద్ర‌రావు

తిరుమల: ప్రతిష్టాత్మకమైన ‘అన్నమయ్య’ చిత్రాన్ని తీసినందుకు ఆ స్వామివారే టీటీడీ బోర్డులో సభ్యుడిగా అవకాశం కల్పించారని భావిస్తున్నట్లు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, సీఎం చంద్రబాబుకు తనపై ఉన్న నమ్మకంతో ఈ అవకాశం లభించిందన్నారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తిరుమలకు వచ్చే భక్తులకు తన వంతు కృషిగా సేవలు అందిస్తానని చెప్పారు. త్వరలో ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రానికి […]

‘అన్నమయ్య’  చిత్ర‌మే టీటీడీ ప‌ద‌వి ఇచ్చింది: రాఘ‌వేంద్ర‌రావు
X
తిరుమల: ప్రతిష్టాత్మకమైన ‘అన్నమయ్య’ చిత్రాన్ని తీసినందుకు ఆ స్వామివారే టీటీడీ బోర్డులో సభ్యుడిగా అవకాశం కల్పించారని భావిస్తున్నట్లు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, సీఎం చంద్రబాబుకు తనపై ఉన్న నమ్మకంతో ఈ అవకాశం లభించిందన్నారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తిరుమలకు వచ్చే భక్తులకు తన వంతు కృషిగా సేవలు అందిస్తానని చెప్పారు. త్వరలో ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేసి త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తారని సమాచారం. ఆధ్యాత్మికం, భక్తిపూర్వకం, కలియుగదైవం శ్రీవారి ప్రథమ నామమైన ‘ఓం నమో వేంకటేశాయ’ పేరుకు తగ్గట్టుగా ఆయన నటులను ఎంపిక చేసే కసరత్తులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
First Published:  28 April 2015 8:47 PM GMT
Next Story