Telugu Global
Cinema & Entertainment

ల‌య‌న్ పోస్ట్ పోన్ కు ప‌క్క గా అదే కార‌ణం..!

బాల‌కృష్ణ‌, త్రిష‌, రాధిక ఆప్టే లీడ్ రోల్స్ లో  కొత్త ద‌ర్శ‌కుడు  స‌త్య‌దేవ్ చేసిన  ల‌య‌న్ చిత్రం  విడుద‌ల పోస్ట్ పోన్ కావ‌డానికి   సౌండ్ మిక్సింగ్ ఇంజినీర్  మధూసూద‌న్ రెడ్డి మ‌ర‌ణ‌మే కార‌ణం అని చెప్పారు చిత్ర యూనిట్.    అయితే ఇంట‌ర్న‌ల్ గా  వినిపించిన వార్త‌ల ప్ర‌కారం  ల‌య‌న్ చిత్రం  బ‌డ్జెట్   ముందుగా ప్లాన్ చేసిన దానికంటే ప‌ది కోట్లు ఎక్కువ కావ‌డంతో.. ప్రొడ్యూస‌ర్   ఏరియాల ప‌రంగా  బ‌య్య‌ర్ల‌కు  ఎక్క‌వ రేటు చెబుతుండ‌టంతో కొన‌డానికి ఎవ‌రు ముందుకు […]

ల‌య‌న్ పోస్ట్ పోన్ కు ప‌క్క గా అదే కార‌ణం..!
X

బాల‌కృష్ణ‌, త్రిష‌, రాధిక ఆప్టే లీడ్ రోల్స్ లో కొత్త ద‌ర్శ‌కుడు స‌త్య‌దేవ్ చేసిన ల‌య‌న్ చిత్రం విడుద‌ల పోస్ట్ పోన్ కావ‌డానికి సౌండ్ మిక్సింగ్ ఇంజినీర్ మధూసూద‌న్ రెడ్డి మ‌ర‌ణ‌మే కార‌ణం అని చెప్పారు చిత్ర యూనిట్. అయితే ఇంట‌ర్న‌ల్ గా వినిపించిన వార్త‌ల ప్ర‌కారం ల‌య‌న్ చిత్రం బ‌డ్జెట్ ముందుగా ప్లాన్ చేసిన దానికంటే ప‌ది కోట్లు ఎక్కువ కావ‌డంతో.. ప్రొడ్యూస‌ర్ ఏరియాల ప‌రంగా బ‌య్య‌ర్ల‌కు ఎక్క‌వ రేటు చెబుతుండ‌టంతో కొన‌డానికి ఎవ‌రు ముందుకు రావ‌డం లేద‌నే టాక్ వినిపించింది.
అయితే చిత్ర యూనిట్ మాత్రం అటువంటిది ఏమి లేద‌ని..సినిమా రిలీజ్ డిలే కావ‌డానికి సౌండ్ మిక్సింగ్ ఇంజినీర్ మ‌ధుసూద‌న్ రెడ్డి చ‌నిపోవ‌డ‌మే అస‌లు కార‌ణ‌మ‌ని తేల్చారు. అయితే మొత్తం మీద మే 8న ల‌య‌న్ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ చిత్రంతో రుద్ర‌పాటి ర‌మ‌ణ‌రాజు ప్రొడ్యూస‌ర్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయ‌న బాల‌కృష్ణ అభిమాని కావ‌డం విశేషం.

First Published:  29 April 2015 8:30 AM GMT
Next Story