9న లాయరుగా కేసీఆర్ !
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం లాయర్ అవతారం ఎత్తనున్నారు. కృష్ణాజలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి స్వయంగా తానే హాజరవుతానని వెల్లడించారు. కృష్ణాలో వాస్తవ కేటాయింపులు, వినియోగం, కొత్త ప్రాజెక్టులకు వరద నీటి మళ్లింపు తదితర అంశాలను బోర్డుకు స్వయంగా వివరించనున్నారు. ఈ బోర్డు సమావేశం శుక్రవారం (8వ తేదీన) ఢిల్లీలో జరగాల్సి ఉన్న దృష్ట్యా… తాను హాజరయ్యేందుకు వీలుగా మరో రోజుకు సమావేశాన్ని వాయిదా వేయించాలని సాగునీటి పారుదల అధికారులకు […]
BY Pragnadhar Reddy6 May 2015 8:46 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 7 May 2015 1:27 AM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం లాయర్ అవతారం ఎత్తనున్నారు. కృష్ణాజలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి స్వయంగా తానే హాజరవుతానని వెల్లడించారు. కృష్ణాలో వాస్తవ కేటాయింపులు, వినియోగం, కొత్త ప్రాజెక్టులకు వరద నీటి మళ్లింపు తదితర అంశాలను బోర్డుకు స్వయంగా వివరించనున్నారు. ఈ బోర్డు సమావేశం శుక్రవారం (8వ తేదీన) ఢిల్లీలో జరగాల్సి ఉన్న దృష్ట్యా… తాను హాజరయ్యేందుకు వీలుగా మరో రోజుకు సమావేశాన్ని వాయిదా వేయించాలని సాగునీటి పారుదల అధికారులకు కేసీఆర్ సూచించారు. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సమావేశాన్ని వాయిదా వేయాలని బోర్డును కోరగా.. వారు అంగీకరించినట్లు తెలిసింది. కృష్ణాబోర్డు భేటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైతే ఏఏ విషయాలు చర్చిస్తారన్నది ఆసక్తికకరంగా మారింది.
Next Story