Telugu Global
Others

రైలు ఢీకొని వైఎస్ఆర్‌సీ ఎమ్మెల్యే సోద‌రుడు దుర్మ‌ర‌ణం!

సూళ్లూరుపేట వైఎస్ఆర్ సీపీ  శాసన సభ్యుడు కిలివేటి సంజీవయ్య సోదరుడు సుజయ్(42) రైలు ఢీకొని మృతి చెందిన విషయం ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది.  పోలీసుల కథనం ప్రకారం… కుటుంబంలో పెద్దవాడైన సంజీవయ్యకు నలుగురు సోదరులు, ఇద్దరు చెల్లెళ్లు. రెండో సోదరుడు సుజయ్ స్థానికంగా ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. గత కొంతకాలంగా సుజయ్ భార్య పుట్టింటిలో ఉండటంతో అతడు తరచూ అక్కడికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో గతనెల 25వ తేదీన […]

సూళ్లూరుపేట వైఎస్ఆర్ సీపీ శాసన సభ్యుడు కిలివేటి సంజీవయ్య సోదరుడు సుజయ్(42) రైలు ఢీకొని మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… కుటుంబంలో పెద్దవాడైన సంజీవయ్యకు నలుగురు సోదరులు, ఇద్దరు చెల్లెళ్లు. రెండో సోదరుడు సుజయ్ స్థానికంగా ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. గత కొంతకాలంగా సుజయ్ భార్య పుట్టింటిలో ఉండటంతో అతడు తరచూ అక్కడికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో గతనెల 25వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిన సుజయ్ అచూకీ తెలియకపోవడంతో బంధువులు అతడి కోసం వెదకడం ప్రారంభించారు. అయితే ఈనెల 25వ తేదీనే రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని సుజయ్ మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం 26వ తేదీన కళంగి నదిలో ఖననం చేశారు. కాగా ఆదివారం సుజయ్ అచూకీ కోసం అతడి సోదరులు సూళ్లూరుపేట రైల్వే పోలీసులను సంప్రదించారు. పోలీసులు మృతుడి ఫొటోలు చూపగా మృతి చెందినది తన సోదరుడిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు… కాదలూరు గ్రామంలో కిలివేటి సంజీవయ్య నివాసానికి చేరుకుని సంతాపం తెలిపారు.
First Published:  10 May 2015 5:35 PM GMT
Next Story