Telugu Global
Others

విద్యుత్ సబ్-స్టేషన్ టెక్నీషియన్ స్వాతి దారుణ హత్య

విజయనగరం జిల్లాలోని ఎస్. కోట రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలియజేశారు. ట్రాక్షన్ విద్యుత్ సబ్-స్టేషన్లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న స్వాతి దారుణ హత్యకు గురైన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఆమె వద్దనున్న నగలు, నగదు కోసమే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేవ‌లం ఆమె వ‌ద్ద ఉన్న సొత్తు కోస‌మే హ‌త్య చేశారా లేక మ‌రేమైనా ఇత‌ర కార‌ణాలున్నాయా అన్న విష‌యం […]

విజయనగరం జిల్లాలోని ఎస్. కోట రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలియజేశారు. ట్రాక్షన్ విద్యుత్ సబ్-స్టేషన్లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న స్వాతి దారుణ హత్యకు గురైన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఆమె వద్దనున్న నగలు, నగదు కోసమే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేవ‌లం ఆమె వ‌ద్ద ఉన్న సొత్తు కోస‌మే హ‌త్య చేశారా లేక మ‌రేమైనా ఇత‌ర కార‌ణాలున్నాయా అన్న విష‌యం తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు.
First Published:  11 May 2015 1:10 PM GMT
Next Story