Telugu Global
International

పాక్‌లో ఉగ్ర పంజాకు 47 మంది బ‌లి

పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. బ‌స్సులో వెళుతున్న ప్ర‌యాణిక‌ల‌పై విచ‌క్ష‌ణ ర‌హితంగా కాల్పులు జ‌రిపారు. బ‌స్పులో ఉన్న వారంతా ఏం జ‌రుగుతుందో ఊహించే లోపే తుపాకులు ఎక్కుపెట్టారు. వీరు జ‌రిపిన కాల్పుల్లో 47 మంది ప్ర‌యాణీకులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో ఇర‌వై మంది వ‌ర‌కు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరంద‌రినీ అందుబాటులో ఉన్న ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు. మృతుల్లో 16 మంది మ‌హిళా ప్ర‌యాణికులున్నారు. మోటారు సైకిళ్ళ‌పై వ‌చ్చిన ఆరుగురు ఉగ్ర‌వాదులు వెళుతున్న బ‌స్సును మార్గ మ‌ధ్య‌లో […]

పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. బ‌స్సులో వెళుతున్న ప్ర‌యాణిక‌ల‌పై విచ‌క్ష‌ణ ర‌హితంగా కాల్పులు జ‌రిపారు. బ‌స్పులో ఉన్న వారంతా ఏం జ‌రుగుతుందో ఊహించే లోపే తుపాకులు ఎక్కుపెట్టారు. వీరు జ‌రిపిన కాల్పుల్లో 47 మంది ప్ర‌యాణీకులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో ఇర‌వై మంది వ‌ర‌కు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరంద‌రినీ అందుబాటులో ఉన్న ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు. మృతుల్లో 16 మంది మ‌హిళా ప్ర‌యాణికులున్నారు. మోటారు సైకిళ్ళ‌పై వ‌చ్చిన ఆరుగురు ఉగ్ర‌వాదులు వెళుతున్న బ‌స్సును మార్గ మ‌ధ్య‌లో ఆపేశారు. వెంట‌నే బ‌స్సు ఎక్కి ప్ర‌యాణికులపై కాల్పులు జ‌రిపారు. ఆ వెంట‌నే బ‌స్సు దిగి వ‌చ్చినంత వేగంగా బైక్‌ల‌పై వెళ్ళిపోయారు. ఈ ఘాతుకానికి ఎవ‌రు పాల్ప‌డిందీ ఇంత‌వ‌ర‌కు తెలియ‌రాలేదు. తామే చేసినట్టు కూడా ఎవ‌రూ క్ల‌యిమ్ చేయ‌లేదు.

First Published:  13 May 2015 1:19 AM GMT
Next Story