Telugu Global
Others

రౌడీ షీట‌ర్ అనిల్ హ‌త్య కేసులో వీడిన మిస్ట‌రీ

విశాఖ: విశాఖ‌ప‌ట్నంలో సంచ‌ల‌నం సృష్టించిన రౌడీ షీట‌ర్ అనిల్ హ‌త్య కేసులో మిస్ట‌రీ వీడిపోయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన‌ట్టు డీసీపీ త్రివిక్ర‌మ వ‌ర్మ తెలిపారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు మ‌రో రౌడీ షీట‌ర్ అయిన మెరుగు చిట్టిబాబు అని, అత‌న్ని కూడా అరెస్ట్ చేశామ‌ని ఆయ‌న తెలిపారు. నిందితుల ద‌గ్గ‌ర నుంచి మార‌ణాయుధాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. మ‌రో ముగ్గురి కోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. 2011లో […]

విశాఖ: విశాఖ‌ప‌ట్నంలో సంచ‌ల‌నం సృష్టించిన రౌడీ షీట‌ర్ అనిల్ హ‌త్య కేసులో మిస్ట‌రీ వీడిపోయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన‌ట్టు డీసీపీ త్రివిక్ర‌మ వ‌ర్మ తెలిపారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు మ‌రో రౌడీ షీట‌ర్ అయిన మెరుగు చిట్టిబాబు అని, అత‌న్ని కూడా అరెస్ట్ చేశామ‌ని ఆయ‌న తెలిపారు. నిందితుల ద‌గ్గ‌ర నుంచి మార‌ణాయుధాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. మ‌రో ముగ్గురి కోసం గాలిస్తున్నామ‌ని చెప్పారు. 2011లో జ‌రిగిన హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న అనిల్‌ను ల‌క్ష్యంగా చేసుకుని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నార‌ని, స‌మ‌యం చూసి హ‌త్య చేశార‌ని ఆయ‌న చెప్పారు.
First Published:  13 May 2015 10:50 PM GMT
Next Story