మీకు కరెంట్.. మాకు నీళ్ళు : కేసీఆర్కు బాబు సూచన
విద్యుత్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమన్వయం చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘మీకు కరెంటు – మాకు నీరు’ అనే రీతిలో పరస్పరం సహకరించుకుంటే బాగుంటుందని ఆకాంక్షించారు. కర్నూలు జిల్లా అవుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్తు, నీటి వాడకంపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని కరెంటు కోసం అనసవరంగా, ముందుగానే వాడేయకుండా ఒక ప్రతిపాదన చేశారు. శ్రీశైలంలో తెలంగాణ […]
BY Pragnadhar Reddy14 May 2015 8:55 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 15 May 2015 10:49 AM GMT
విద్యుత్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమన్వయం చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘మీకు కరెంటు – మాకు నీరు’ అనే రీతిలో పరస్పరం సహకరించుకుంటే బాగుంటుందని ఆకాంక్షించారు. కర్నూలు జిల్లా అవుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్తు, నీటి వాడకంపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని కరెంటు కోసం అనసవరంగా, ముందుగానే వాడేయకుండా ఒక ప్రతిపాదన చేశారు. శ్రీశైలంలో తెలంగాణ నీటి వాటాతో ఉత్పత్తి అయ్యే మేరకు విద్యుత్తును ఇతరత్రా మార్గాలలో తాము సర్దుబాటు చేసి ఆ రాష్ట్రానికి అందిస్తామని… ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ఇవ్వాలని సూచించారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ఈ సహకారం కోరుతున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story