ఆర్టీసీ విభజనకు ముహూర్తం ఖరారు!
రెండు తెలుగు రా ష్ట్రాల్లో కీలక విభాగమైన ఆర్టీసీ విభజనకు రంగం సిద్ధమైంది. ఉద్యోగుల విభజన ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో తాజానిర్ణయంతో మే 28 నుంచి పరిపాలన విభాగాలు కూడా వేరుపడనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ బస్ భవన్లో ఏ బ్లాక్ను ఆంధ్రకు, బి-బ్లాక్ను తెలంగాణకు కేటాయించారు. ఈడీలు, ఆర్ ఎంల సహా అన్ని రకాల ఉద్యోగుల విభజన ఇప్పటికే పూర్తయింది. వాస్తవానికి మే 14నే […]
BY Pragnadhar Reddy16 May 2015 1:55 AM GMT
Pragnadhar Reddy Updated On: 16 May 2015 9:05 PM GMT
రెండు తెలుగు రా ష్ట్రాల్లో కీలక విభాగమైన ఆర్టీసీ విభజనకు రంగం సిద్ధమైంది. ఉద్యోగుల విభజన ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో తాజానిర్ణయంతో మే 28 నుంచి పరిపాలన విభాగాలు కూడా వేరుపడనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ బస్ భవన్లో ఏ బ్లాక్ను ఆంధ్రకు, బి-బ్లాక్ను తెలంగాణకు కేటాయించారు. ఈడీలు, ఆర్ ఎంల సహా అన్ని రకాల ఉద్యోగుల విభజన ఇప్పటికే పూర్తయింది. వాస్తవానికి మే 14నే విభజన జరగాల్సి ఉన్నా కార్మికుల సమ్మెతో వాయిదా పడింది. ఉమ్మడి ఆస్తులపై 25న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Next Story