Telugu Global
Cinema & Entertainment

త్రిషపై అలా కోపం తీర్చుకుంది

చెన్నై బ్యూటీ త్రిష పెళ్లి పెటాకులైన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె నిశ్ఛితార్థం జరగడం.. ఆ వెంటనే పెళ్లి క్యాన్సిల్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ విషయాన్ని త్రిష వీలైనంత తొందరగా మరిచిపోవడానికి ప్రయత్నించింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. కానీ లక్ష్మీరాయ్ మాత్రం ఆ విషయాన్ని మరిచిపోలేదు. త్రిష పెళ్లి చెడిపోవడంతో ఈ అమ్మడు పండగ చేసుకుంటోంది. అంతేకాదు.. ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి పెద్ద పార్టీ కూడా ఇచ్చింది. త్రిష పెళ్లికి, లక్ష్మీ రాయ్ కు సంబంధం ఉంది. […]

త్రిషపై అలా కోపం తీర్చుకుంది
X
చెన్నై బ్యూటీ త్రిష పెళ్లి పెటాకులైన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె నిశ్ఛితార్థం జరగడం.. ఆ వెంటనే పెళ్లి క్యాన్సిల్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ విషయాన్ని త్రిష వీలైనంత తొందరగా మరిచిపోవడానికి ప్రయత్నించింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. కానీ లక్ష్మీరాయ్ మాత్రం ఆ విషయాన్ని మరిచిపోలేదు. త్రిష పెళ్లి చెడిపోవడంతో ఈ అమ్మడు పండగ చేసుకుంటోంది. అంతేకాదు.. ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి పెద్ద పార్టీ కూడా ఇచ్చింది. త్రిష పెళ్లికి, లక్ష్మీ రాయ్ కు సంబంధం ఉంది.
త్రిషను పెళ్లాడాలని అనుకున్న వరుణ్ ను త్రిషకు పరిచయం చేసిందే లక్ష్మీరాయ్. ఆ తర్వాత లక్ష్మీరాయ్ ను పక్కనపెట్టి వాళ్లిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారట. ఈ విషయమే లక్ష్మీరాయ్ కు కోపం తెప్పించింది. త్రిష పచ్చిఅబద్ధాలకోరంటూ ఆమధ్య మీడియాకెక్కింది కూడా. అయితే ఇవేవీ పట్టించుకోకుండా త్రిష-వరుణ్ పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. సో.. త్రిష పెళ్లి ఆగిపోవడంతో లక్ష్మీరాయ్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. అందుకే అందర్నీ పిలిచి పెద్ద పార్టీ ఇచ్చిందట.
First Published:  18 May 2015 7:41 PM GMT
Next Story