హైదరాబాద్లో ఇక అర్ధరాత్రి 12 దాకా హోటళ్లు
రాజధాని వాసులకు శుభవార్త. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లలో అర్ధరాత్రి 12 దాకా భోజనం లభించనుంది. నగరంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం రాత్రి 10 గంటల తరువాత హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం లభించేది కాదు. ఈ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు హోమంత్రి నాయిని నరసింహారెడ్డి శనివారం వెల్లడించారు. అయితే, పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో […]
BY Pragnadhar Reddy22 May 2015 8:33 PM GMT
Pragnadhar Reddy Updated On: 23 May 2015 8:36 PM GMT
రాజధాని వాసులకు శుభవార్త. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లలో అర్ధరాత్రి 12 దాకా భోజనం లభించనుంది. నగరంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం రాత్రి 10 గంటల తరువాత హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం లభించేది కాదు. ఈ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు హోమంత్రి నాయిని నరసింహారెడ్డి శనివారం వెల్లడించారు. అయితే, పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Next Story