Telugu Global
NEWS

టీడీపీపై క్రిమిన‌ల్ కేసుకు కాంగ్రెస్ డిమాండ్‌

ఎన్నిక‌ల హామీల అమ‌లును తుంగ‌లోకి తొక్కిన తెలుగుదేశం ప్ర‌భుత్వంపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని కాంగ్రెస్ నేత‌లు డిమాండు చేశారు. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి వృద్ధుల వ‌ర‌కు టీడీపీ అనేక హామీలిచ్చింద‌ని వాటిలో ప్ర‌ధాన‌మైన వాగ్దానాలేమీ నేర‌వేర్చ‌లేకపోయింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడు ఎన్. ర‌ఘువీరారెడ్డి ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ఇచ్చిన ఆరొంద‌లకు పైగా హామీల జాబితాను, ఆ పార్టీ మ్యానిఫెస్టోను, వాగ్ధానాల వీడియో క్లిప్పింగ్‌ల‌ను జ‌త చేసి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భ‌న్వ‌ర్‌లాల్‌కి ఫిర్యాదు చేసింది […]

టీడీపీపై క్రిమిన‌ల్ కేసుకు కాంగ్రెస్ డిమాండ్‌
X
ఎన్నిక‌ల హామీల అమ‌లును తుంగ‌లోకి తొక్కిన తెలుగుదేశం ప్ర‌భుత్వంపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని కాంగ్రెస్ నేత‌లు డిమాండు చేశారు. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి వృద్ధుల వ‌ర‌కు టీడీపీ అనేక హామీలిచ్చింద‌ని వాటిలో ప్ర‌ధాన‌మైన వాగ్దానాలేమీ నేర‌వేర్చ‌లేకపోయింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడు ఎన్. ర‌ఘువీరారెడ్డి ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ఇచ్చిన ఆరొంద‌లకు పైగా హామీల జాబితాను, ఆ పార్టీ మ్యానిఫెస్టోను, వాగ్ధానాల వీడియో క్లిప్పింగ్‌ల‌ను జ‌త చేసి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భ‌న్వ‌ర్‌లాల్‌కి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. మంగ‌ళ‌వారం ఏపీ పీసీసీ నేత ఎన్. ర‌ఘువీరారెడ్డి సార‌థ్యంలో ఆనం వివేకానంద‌రెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, కొండ్రు ముర‌ళి, క‌నుమూరి బాపిరాజు, సి. రామ‌చంద్ర‌య్య‌ల‌తో కూడిన బృందం భ‌న్వ‌ర్‌లాల్‌ను క‌లిసింది. రైతు రుణ మాఫీపై ఇచ్చిన హామీలు ఇంత‌వ‌ర‌కు నెర‌వేర్చ‌లేద‌ని, త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే నిరుద్యోగుల‌కు రూ. 1000 భృతి ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని అదింకా నెర‌వేర‌లేద‌ని, డ్వాక్రా రుణాల ర‌ద్దుకు ఇచ్చిన హామీ… హామీగానే మిగిలిపోయింద‌ని, కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య ఇప్పిస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని… ఆ హామీ గాలికి కొట్టుకుపోయింద‌ని, అమ్మాయి పుడితే మ‌హాల‌క్ష్మి పుట్టింది అనుకునేట్టుగా చేస్తామ‌ని వాగ్ధానం చేశార‌ని… ఇలాంటి హామీల‌న్నీ అస‌లు ప్ర‌స్తావ‌నే లేకుండా పోయాయ‌ని వారు ఆరోపించారు. సాధ్యం కాని హామీలిచ్చి టీడీపీ ప్ర‌జ‌ల‌ను వంచించింద‌ని, ఇలాంటి ప్ర‌భుత్వంపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు భ‌న్వ‌ర్‌లాల్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.
First Published:  26 May 2015 3:46 AM GMT
Next Story