Telugu Global
Others

టి-క‌ళాకారుల‌కు అన్యాయం జ‌రిగితే 'పోరు ధూంధాం'

తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయిపై టీఆర్‌ఎస్‌ సాంస్కృతిక విభాగం నేత నేర్నాల కిషోర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ తెలంగాణ రాష్ట్రంలో అసలైన కళాకారులకు అన్యాయం జరిగిందంటూ తనకు వచ్చిన అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ను చించివేసి, నిరసన వ్యక్తం చేశారు. రసమయి తనకు నచ్చినవారికే ఉద్యోగాలు ఇచ్చారని, ఉద్యోగాలు పొందిన వారి పేర్లను బహిర్గతం చేయాలని, మొత్తం నియామకాలను రద్దు చేయాలని నేర్నాల డిమాండ్ చేశారు. తెలంగాణ సర్కారు తీరు ఇలాగే కొనసాగితే త్వరలో పోరు ధూంధాం పేరుతో […]

తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయిపై టీఆర్‌ఎస్‌ సాంస్కృతిక విభాగం నేత నేర్నాల కిషోర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ తెలంగాణ రాష్ట్రంలో అసలైన కళాకారులకు అన్యాయం జరిగిందంటూ తనకు వచ్చిన అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ను చించివేసి, నిరసన వ్యక్తం చేశారు. రసమయి తనకు నచ్చినవారికే ఉద్యోగాలు ఇచ్చారని, ఉద్యోగాలు పొందిన వారి పేర్లను బహిర్గతం చేయాలని, మొత్తం నియామకాలను రద్దు చేయాలని నేర్నాల డిమాండ్ చేశారు. తెలంగాణ సర్కారు తీరు ఇలాగే కొనసాగితే త్వరలో పోరు ధూంధాం పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
First Published:  25 May 2015 1:32 PM GMT
Next Story