Telugu Global
Others

రైలు కింద ప‌డి తండ్రి, ఇద్ద‌రు పిల్ల‌ల ఆత్మ‌హ‌త్య‌

కుటుంబంలో రేగిన క‌ల‌త‌లు మూడు నిండుప్రాణాల‌ను బ‌లితీసుకున్నాయి. కుటుంబ‌స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఓ తండ్రి, త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తోపాటు రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా మ‌ధిర రైల్వేస్టేష‌న్ స‌మీపంలో జ‌రిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపన్నపల్లికి చెందిన గుండా వెంకటరమణ(34)కు భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కొంత‌కాలంగా వీరి కాపురంలో క‌ల‌త‌లు రేగాయి.  క‌లిసి కాపురం చేయ‌లేమ‌ని నిర్ణ‌యించుకున్న దంప‌తులు ఇటీవ‌ల విడాకులు కూడా తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం వెంక‌ట‌ర‌మ‌ణ […]

కుటుంబంలో రేగిన క‌ల‌త‌లు మూడు నిండుప్రాణాల‌ను బ‌లితీసుకున్నాయి. కుటుంబ‌స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఓ తండ్రి, త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తోపాటు రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా మ‌ధిర రైల్వేస్టేష‌న్ స‌మీపంలో జ‌రిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపన్నపల్లికి చెందిన గుండా వెంకటరమణ(34)కు భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కొంత‌కాలంగా వీరి కాపురంలో క‌ల‌త‌లు రేగాయి. క‌లిసి కాపురం చేయ‌లేమ‌ని నిర్ణ‌యించుకున్న దంప‌తులు ఇటీవ‌ల విడాకులు కూడా తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం వెంక‌ట‌ర‌మ‌ణ త‌న పిల్ల‌లు అశ్రుత్(10), అభిజ్ఞ(7)తో కలసి విహార యాత్రలకు బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో వారంతా బుధవారం రాత్రి మధిర చేరుకున్నారు. రాత్రి 11 గంటల తర్వాత రైల్వే స్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం మృతదేహాలను గమనించిన రైల్వే పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
First Published:  27 May 2015 1:06 PM GMT
Next Story