మహానాడులో హామీల మాటేది?: రఘువీరా
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై మహానాడులో చర్చ జరగాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ 600 హామీలు ఇచ్చిందని, వాటిని పార్టీ వెబ్సైట్లో పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జరుపుకుంటున్నది ‘మహానాడు కాదని, దగానాడని’ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు రాసిన మనసులో మాట పుస్తకంలోని ముఖ్యాంశాలతో తయారు చేసిన కరపత్రాన్ని రఘువీరారెడ్డి తిరుపతిలో విడుదల చేశారు. […]
BY Pragnadhar Reddy28 May 2015 12:44 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 28 May 2015 12:44 PM GMT
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై మహానాడులో చర్చ జరగాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ 600 హామీలు ఇచ్చిందని, వాటిని పార్టీ వెబ్సైట్లో పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జరుపుకుంటున్నది ‘మహానాడు కాదని, దగానాడని’ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు రాసిన మనసులో మాట పుస్తకంలోని ముఖ్యాంశాలతో తయారు చేసిన కరపత్రాన్ని రఘువీరారెడ్డి తిరుపతిలో విడుదల చేశారు. ఎన్టీఆర్ మాటలతో ఉన్న సీడీని కూడా ఆయన విడుదల చేశారు. 50 పేజీల తెలుగుదేశం పార్టీ మేనిఫేస్టో అని… ఆరు వందల హామీలు ఇచ్చారని, టీడీపీకి నిజాయితీ ఉంటే ఇవన్నీ టీడీపీ వెబ్ సైట్లో పెట్టాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
Next Story