అమరుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ: రేవంత్
అమరుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గండిపేటలో జరుగుతున్న 34వ మహానాడులో తెలంగాణ అమరవీరులు, టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై తీర్మానం చేశారు. తెలంగాణ రావడానికి తానే కారణమన్నట్టు పుస్తకాల్లో పాఠాలు వేయించుకున్నారని, అమరుల త్యాగాల్ని గాలికొదిలేశారని అన్నారు. ఈ తీర్మానాన్ని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత రేవంత్రెడ్డి ప్రవేశపెట్టారు. తెలంగాణ వస్తే అభివృద్ది చెందుతామని ఉద్యమాలు చేసిన యువకులను టీఆర్ఎస్ ప్రభుత్వం నట్టేట ముంచుతుందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం […]
BY Pragnadhar Reddy27 May 2015 1:05 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 27 May 2015 11:57 PM GMT
అమరుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గండిపేటలో జరుగుతున్న 34వ మహానాడులో తెలంగాణ అమరవీరులు, టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై తీర్మానం చేశారు. తెలంగాణ రావడానికి తానే కారణమన్నట్టు పుస్తకాల్లో పాఠాలు వేయించుకున్నారని, అమరుల త్యాగాల్ని గాలికొదిలేశారని అన్నారు. ఈ తీర్మానాన్ని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత రేవంత్రెడ్డి ప్రవేశపెట్టారు. తెలంగాణ వస్తే అభివృద్ది చెందుతామని ఉద్యమాలు చేసిన యువకులను టీఆర్ఎస్ ప్రభుత్వం నట్టేట ముంచుతుందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఖరి వల్ల తెలంగాణ రావడం బాగా ఆలస్యమైందని, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ అధికారంలోకి వచ్చారని తెలిపారు. కానీ ప్రస్తుతం హామీలన్నీ మరిచిపోయి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
Next Story