టీడీపీకి మరో దెబ్బ: మాధవరం ఔట్
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుంది తెలంగాణలో టీడీపీ పరిస్థితి. జూన్ 1న జరిగే మండలి అభ్యర్థుల ఎన్నిక టీడీపీ చావుకొచ్చిన్నట్లుంది. తాజాగా తెలంగాణ టీడీపీలో మరో వికెట్ పడింది. కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం టీఆర్ఎస్ లో చేరారు. మెదక్ జిల్లా జగదేవ్ పూర్ లోని ఫాంహౌస్ లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబి కండువా కప్పుకొన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీలోకి కృష్ణారావు చేరికను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]
BY Pragnadhar Reddy30 May 2015 8:31 AM GMT
X
Pragnadhar Reddy Updated On: 30 May 2015 8:31 AM GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుంది తెలంగాణలో టీడీపీ పరిస్థితి. జూన్ 1న జరిగే మండలి అభ్యర్థుల ఎన్నిక టీడీపీ చావుకొచ్చిన్నట్లుంది. తాజాగా తెలంగాణ టీడీపీలో మరో వికెట్ పడింది. కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం టీఆర్ఎస్ లో చేరారు. మెదక్ జిల్లా జగదేవ్ పూర్ లోని ఫాంహౌస్ లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబి కండువా కప్పుకొన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీలోకి కృష్ణారావు చేరికను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేశ్ ఫోన్ లో ఎంతగా ప్రయత్నించినా.. కృష్ణారావు మాత్రం ఆయనకు అందుబాటులోకి రాలేదు. సోమవారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కృష్ణారావు టీడీపీని వీడటం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. మహానాడు విజయవంతమైందని తెలుగు తమ్ముళ్లు జబ్బలు చరుచుకునేలోగానే.. కేసీఆర్ తన మార్కు రాజకీయం చూపించారు. తెలంగాణలో టీడీపీని చావు దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలోనూ ప్రస్తావించారు. తెలంగాణలో టీడీపీ ఉండదని ముందుగానే చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేలతోనూ సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. గ్రేటర్ ఎన్నికల నాటికి నగరంలో టీడీపీని ఖాళీ చేయించాలన్నది టీఆర్ ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.
Next Story