Telugu Global
NEWS

2న విజయవాడలో బాబు నవ నిర్మాణ దీక్ష

విజయవాడలో 2న నవనిర్మాణ దీక్ష చేపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేదికను మార్చారు. ముందుగా అనుకున్న ప్రకారం ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఐజీఎంసీ) స్టేడియం కాకుండా ప్రజల దగ్గరే దీక్ష చేపడితే బాగుంటుందని సీఎం భావిస్తుండటంతో జనసమ్మర్ధ కూడలి అయిన బెంజిసర్కిల్‌ను వేదికగా నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. బెంజి సర్కిల్‌లో ఉన్న పెట్రోల్‌ బంక్‌ దగ్గర ఈశాన్యం వైపు వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేదికకు అభిముఖంగా బందరు రోడ్డు, ఎన్‌హెచ్‌ 5, 9 లపై […]

2న విజయవాడలో బాబు నవ నిర్మాణ దీక్ష
X
విజయవాడలో 2న నవనిర్మాణ దీక్ష చేపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేదికను మార్చారు. ముందుగా అనుకున్న ప్రకారం ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఐజీఎంసీ) స్టేడియం కాకుండా ప్రజల దగ్గరే దీక్ష చేపడితే బాగుంటుందని సీఎం భావిస్తుండటంతో జనసమ్మర్ధ కూడలి అయిన బెంజిసర్కిల్‌ను వేదికగా నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. బెంజి సర్కిల్‌లో ఉన్న పెట్రోల్‌ బంక్‌ దగ్గర ఈశాన్యం వైపు వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేదికకు అభిముఖంగా బందరు రోడ్డు, ఎన్‌హెచ్‌ 5, 9 లపై 15 వేల కుర్చీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేదిక ఏర్పాటును జిల్లా యంత్రాంగం చేపట్టనుంది. శానిటేషన్‌, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను కార్పొరేషన్‌ చూసుకుంటుంది. భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్ల ద్వారా దీక్షస్థలిని ప్రత్యక్ష ప్రసారం చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు
First Published:  30 May 2015 5:04 AM GMT
Next Story