Telugu Global
Others

గుంటూరులో కాంగ్రెస్ కోటి సంతకాల సేకరణ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ… కాంగ్రెస్‌పార్టీ కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల సంతకాలు పూర్తి చేసినట్లు… ఆ పార్టీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి చెప్పారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతూ… ప్రజలను మోసం చేస్తున్నారని రఘువీర దుయ్యబట్టారు. ‘చంద్రబాబు ఏడాది పాలన మొత్తం మోసాలు, కుట్రలు’ అంటూ ఏపీ పిసిసి అధ్యక్షుడు రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఏడాది పాలనపై కాంగ్రెస్ పలు […]

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ… కాంగ్రెస్‌పార్టీ కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల సంతకాలు పూర్తి చేసినట్లు… ఆ పార్టీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి చెప్పారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతూ… ప్రజలను మోసం చేస్తున్నారని రఘువీర దుయ్యబట్టారు. ‘చంద్రబాబు ఏడాది పాలన మొత్తం మోసాలు, కుట్రలు’ అంటూ ఏపీ పిసిసి అధ్యక్షుడు రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఏడాది పాలనపై కాంగ్రెస్ పలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. జూన్ 8న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బాబు ఏడాది పాలనపై నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తామని రఘువీరా తెలిపారు.
First Published:  31 May 2015 1:09 PM GMT
Next Story