Telugu Global
National

జార్ఖండ్‌లో ఎన్‌కౌంట‌ర్...12 మంది మావోల హతం

జార్ఖండ్‌, జూన్‌ 9 : రాష్ట్రంలోని పలమ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సోమవారం అర్థరాత్రి సత్‌బర్వ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఘటనాస్థలిలో అధునాతన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స‌త్‌బ‌ర్వ పోలీసుల స్టేష‌న్ ప‌రిధిలో మావోల సంచారం ఉంద‌ని ర‌హ‌స్య స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ప‌క్కా ప్లాన్‌తో కూంబింగ్ నిర్వ‌హించారు. మావోల‌ను ప‌సిగ‌ట్టిన పోలీసులు వారి […]

జార్ఖండ్‌లో ఎన్‌కౌంట‌ర్...12 మంది మావోల హతం
X
జార్ఖండ్‌, జూన్‌ 9 : రాష్ట్రంలోని పలమ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సోమవారం అర్థరాత్రి సత్‌బర్వ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఘటనాస్థలిలో అధునాతన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స‌త్‌బ‌ర్వ పోలీసుల స్టేష‌న్ ప‌రిధిలో మావోల సంచారం ఉంద‌ని ర‌హ‌స్య స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ప‌క్కా ప్లాన్‌తో కూంబింగ్ నిర్వ‌హించారు. మావోల‌ను ప‌సిగ‌ట్టిన పోలీసులు వారి క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తుండ‌గా మావోలు కూడా వారిని గ‌మ‌నించారు. త‌ప్పించుకునే య‌త్నంలో కాల్పులు జ‌రిపారు. ఇరుప‌క్షాల నుంచి ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కాల్పుల్లో 12 మంది మావోలు చ‌నిపోయారు. ముగ్గురు పోలీసుల‌కు గాయాల‌య్యాయి. ఇంకా ఆ ప్రాంతంలో మావోలెవ‌రైనా ఉన్నారా అనే అంశంపై పోలీసులు గాలింపు జ‌రుపుతున్నారు.
First Published:  9 Jun 2015 2:19 AM GMT
Next Story