నేటి నుంచి తెలంగాణలో షర్మిల పరామర్శయాత్ర
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో రెండో విడత యాత్రను మంగళవారం నుంచి చేపట్టనున్నారు. శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. ఇది వరకు ఆమె మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో 6 నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర నిర్వహించారు. ఇప్పుడు నల్లగొండలో రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా మిగిలిన భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, […]
BY Pragnadhar Reddy8 Jun 2015 9:11 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 8 Jun 2015 9:11 PM GMT
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో రెండో విడత యాత్రను మంగళవారం నుంచి చేపట్టనున్నారు. శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. ఇది వరకు ఆమె మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో 6 నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర నిర్వహించారు. ఇప్పుడు నల్లగొండలో రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా మిగిలిన భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో పరామర్శ యాత్ర చేపట్టేందుకు మంగళవారం ఉద యం 9.30కు హైదరాబాద్లోని లోటస్పాండ్ లోని తమ నివాసం నుంచి బయలుదేరుతారు.
Next Story