Telugu Global
Cinema & Entertainment

మగధీర పేరెత్తితే చిర్రెత్తుకొస్తోంది

టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన మగధీర సినిమా బాలీవుడ్ లో కూడా రాబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొద్దామని గడిచిన మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు కరణ్. కానీ అతడి ప్రయత్నాలేవీ కొలిక్కిరాలేదు. మొదట ఈ సినిమాలో హృతిక్ రోషన్ ను హీరోగా తీసుకుందాం అనుకున్నాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. తర్వాత అమీర్ ఖాన్, షారూక్, సల్మాన్ లను కూడా ఆశ్రయించాడు. […]

మగధీర పేరెత్తితే చిర్రెత్తుకొస్తోంది
X
టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన మగధీర సినిమా బాలీవుడ్ లో కూడా రాబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొద్దామని గడిచిన మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు కరణ్. కానీ అతడి ప్రయత్నాలేవీ కొలిక్కిరాలేదు. మొదట ఈ సినిమాలో హృతిక్ రోషన్ ను హీరోగా తీసుకుందాం అనుకున్నాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. తర్వాత అమీర్ ఖాన్, షారూక్, సల్మాన్ లను కూడా ఆశ్రయించాడు. ఫ్రెండ్ షిప్ కొద్దీ వాళ్లు కథ విన్నప్పటికీ.. రీమేక్ లో నటించేందుకు మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత రణబీర్ సింగ్ పేరు వినిపించినప్పటికీ అది కూడా ఫైనలైజ్ కాలేదు. ఎట్టకేలకు వరుణ్ ధావన్, అలియాభట్ ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని కరణ్ కూడా ప్రకటించాడు. మిగతా బాలీవుడ్ స్టార్లు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా చెప్పారు. అయితే ఇంతలోనే ఏమైందో ఏమో.. వాళ్లు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కరణ్ జోహార్ ముందు ప్రస్తావిస్తే విసుక్కుంటున్నాడు. కరణ్ అలా రియాక్ట్ అయ్యాడంటే.. సినిమా అటకెక్కినట్టే.
First Published:  9 Jun 2015 11:10 PM GMT
Next Story