రోడ్డు ప్రమాదంలో మంత్రి ఈటెలకు గాయాలు
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. హుజూరాబాద్లో పల్లెవెలుగు బస్సులను ప్రారంభించి కరీంనగర్ వస్తున్న ఈటెల వాహనం మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ప్రమాదంలో మంత్రికి స్వల్పంగా గాయాలయ్యాయి. కాలుకు బలమైన గాయం తగిలింది. కదలలేని స్థితిలో ఆయన్ని స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక […]
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. హుజూరాబాద్లో పల్లెవెలుగు బస్సులను ప్రారంభించి కరీంనగర్ వస్తున్న ఈటెల వాహనం మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ప్రమాదంలో మంత్రికి స్వల్పంగా గాయాలయ్యాయి. కాలుకు బలమైన గాయం తగిలింది. కదలలేని స్థితిలో ఆయన్ని స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స జరుగుతోంది. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న పీఏ ముకుందరెడ్డి తలకు బలమైన గాయాలు తగిలాయి. కారు అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆయన గన్మెన్లు ఇద్దరితోపాటు వేగాన్ని అదుపు చేయలేని డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వెళుతున్నప్పుడు ప్రమాదం జరగడంతో కారు ఐదు పల్టీలు కొట్టినట్టు తెలుస్తోంది. ఈటెలకు అపోలోలో చికిత్స కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గంగుల కమలాకర్ తెలిపారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఫోన్లో ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గతంలో ఇదే వాహనం జిల్లాలోని శంకరపట్నం వద్ద చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు అందులో మంత్రి లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.