Telugu Global
NEWS

గ‌వ‌ర్న‌ర్ కేసీఆర్ ప‌క్ష‌పాతి: సోమిరెడ్డి ఆగ్ర‌హం

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గ‌వ‌ర్న‌ర్‌ ఆంధ్రప్రదేశ్ పట్ల నరసింహన్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ ఏడాది పాలనలో తీసుకున్న పది నిర్ణయాలపై కోర్టు అక్షంతలు వేసిందని, గ‌వ‌ర్న‌ర్‌కు మాత్రం ఇవేమీ క‌న‌ప‌డ‌డం లేద‌ని ఆయన గుర్తు […]

గ‌వ‌ర్న‌ర్ కేసీఆర్ ప‌క్ష‌పాతి: సోమిరెడ్డి ఆగ్ర‌హం
X
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గ‌వ‌ర్న‌ర్‌ ఆంధ్రప్రదేశ్ పట్ల నరసింహన్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా గవర్నర్ నోరు మెదపడం లేదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ ఏడాది పాలనలో తీసుకున్న పది నిర్ణయాలపై కోర్టు అక్షంతలు వేసిందని, గ‌వ‌ర్న‌ర్‌కు మాత్రం ఇవేమీ క‌న‌ప‌డ‌డం లేద‌ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ నిర్ణయాలు ఏక‌ప‌క్ష‌మ‌ని కోర్టులకు తెలుస్తున్నా నరసింహన్ కు మాత్రం తెలియడం లేదన్నారు. ప్రజలకు న్యాయం చేయలేని గవర్నర్, రాజ్ భవన్ ఎందుకు అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ఉత్సవ విగ్రహాం కాకూడ‌దని సోమిరెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భాష ఎవ‌రికైనా అస‌హ్యం క‌లిగిస్తుంద‌ని అన్నారు. ప్రతి అంశాన్ని కేసీఆర్ సర్కార్ వివాదం చేస్తోందని తెలిపారు. కోర్టులు అక్షింత‌లు వేసినా కేసీఆర్ తీరు మాత్రం మారడం లేదని అన్నారు.
First Published:  14 Jun 2015 6:22 AM GMT
Next Story