Telugu Global
Others

‘నవజీవన్’ దొంగ మార్కాపురం ఓఎస్డీ

గత నెల నవజీవన్ రైలులో ప్రయాణిస్తున్న నగల వ్యాపారుల నుంచి రూ.82 లక్షల దోపిడీకి యత్నించిన కేసులో ఓ పోలీసు అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సదరు అధికారి పేరు సమైజాన్‌రావు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీగా పనిచేస్తున్నారు. సాయుధ రిజ‌ర్వు పోలీసుల ద‌ళానికి చెందిన కానిస్టేబుళ్ళ‌తో స‌మైజాన్‌రావు ఈ దోపిడీ చేయించే ప్ర‌య‌త్నం చేశార‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది.  మరికాసేపట్లో నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు […]

గత నెల నవజీవన్ రైలులో ప్రయాణిస్తున్న నగల వ్యాపారుల నుంచి రూ.82 లక్షల దోపిడీకి యత్నించిన కేసులో ఓ పోలీసు అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సదరు అధికారి పేరు సమైజాన్‌రావు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీగా పనిచేస్తున్నారు. సాయుధ రిజ‌ర్వు పోలీసుల ద‌ళానికి చెందిన కానిస్టేబుళ్ళ‌తో స‌మైజాన్‌రావు ఈ దోపిడీ చేయించే ప్ర‌య‌త్నం చేశార‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. మరికాసేపట్లో నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి రిమాండులో ఉంచారు.
First Published:  14 Jun 2015 1:45 PM GMT
Next Story