తెలుగు ప్రజలకు చంద్రబాబు తలవంపులు: హరీష్రావు
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తలవంపులు తెచ్చుకున్నారని తెలంగాణ మంత్రి హరీష్రావు వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో ఉండటం రాజ్యాంగ విరుద్ధమని…దీనిపై కేంద్రం, గవర్నర్ స్పందించాలని ఆయన కోరారు. అనుమతి లేకుండా ఇళ్లు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి ప్లాన్ను జీహెచ్ఎంసీ తిరస్కరిస్తే దాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని హరీష్రావు ఆగ్రహించారు. ఓటుకు నోటు కేసులో ఉన్న సండ్ర వెంకట వీరయ్యను విశాఖలో దాస్తారు… మత్తయ్యను విజయవాడలో దాస్తారు… […]
BY Pragnadhar Reddy20 Jun 2015 9:38 AM GMT
X
Pragnadhar Reddy Updated On: 22 Jun 2015 1:35 AM GMT
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తలవంపులు తెచ్చుకున్నారని తెలంగాణ మంత్రి హరీష్రావు వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో ఉండటం రాజ్యాంగ విరుద్ధమని…దీనిపై కేంద్రం, గవర్నర్ స్పందించాలని ఆయన కోరారు. అనుమతి లేకుండా ఇళ్లు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి ప్లాన్ను జీహెచ్ఎంసీ తిరస్కరిస్తే దాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని హరీష్రావు ఆగ్రహించారు. ఓటుకు నోటు కేసులో ఉన్న సండ్ర వెంకట వీరయ్యను విశాఖలో దాస్తారు… మత్తయ్యను విజయవాడలో దాస్తారు… ప్రభుత్వం చేయాల్సిన పనులేనా ఇవి అని ప్రశ్నించారు. మీరు చేసిన తప్పులను ఎత్తి చూపినందుకు టీ-న్యూస్కు నోటీసులిస్తారా… స్థానిక పోలీసులకు చెప్పకుండా ఇదేం పని అని ఆయన విమర్శించారు. తమకు కక్ష సాధించాల్సిన అవసరం లేదని, ఒక రాష్ట్రంలో వేరే రాష్ట్రం పోలీసులను మోహరించే విధానం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ అంశంపై గవర్నర్నే అడుగుతామని హరీష్రావు అన్నారు.
Next Story