Telugu Global
Others

మావోల దాడిలో ఓ పోలీసు మృతి... ఇద్ద‌రికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు భీభత్సం సృష్టించారు. తుంనార్ సంతలో ముగ్గురు ఎస్పీవోలపై నక్సల్స్ కత్తులతో దాడి చేసి కాల్పులు జరిపారు. అందరూ చూస్తుండగానే నక్సల్స్ బరి తెగించి దాడికి పాల్పడ్డారు. చుట్టుపక్కలున్నవారెవరూ వారిని అడ్డుకుని, అపే సాహసం చేయలేదు. ఒక్కసారిగా మావోలు దాడి చేయడంతో ఏం జరుగుతుందో అర్ధం కాని స్థితిలో ఎస్పీవోలు కూడా వారిని ఎదుర్కోలేక పోయారు. దాంతో ముగ్గురు కూడా గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. […]

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు భీభత్సం సృష్టించారు. తుంనార్ సంతలో ముగ్గురు ఎస్పీవోలపై నక్సల్స్ కత్తులతో దాడి చేసి కాల్పులు జరిపారు. అందరూ చూస్తుండగానే నక్సల్స్ బరి తెగించి దాడికి పాల్పడ్డారు. చుట్టుపక్కలున్నవారెవరూ వారిని అడ్డుకుని, అపే సాహసం చేయలేదు. ఒక్కసారిగా మావోలు దాడి చేయడంతో ఏం జరుగుతుందో అర్ధం కాని స్థితిలో ఎస్పీవోలు కూడా వారిని ఎదుర్కోలేక పోయారు. దాంతో ముగ్గురు కూడా గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు.
First Published:  19 Jun 2015 1:39 PM GMT
Next Story